కిరణ్ ఆలోచన: ముగ్గురు మంత్రులకు ఉద్వాసన

Kiran Kumar Reddy
హైదరాబాద్: ముగ్గురు మంత్రులకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉద్వాసన పలకాలనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకటి, రెండు రోజుల్లో హస్తినకు వెళ్లి తన ఆలోచనకు కాంగ్రెసు అధిష్టానం ఆమోద ముద్ర వేయించుకోవాలని ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు. ముగ్గురిని మంత్రి వర్గం నుంచి తొలగించి వారి స్థానంలో కొత్తగా ముగ్గురిని మంత్రి వర్గంలో చేర్చుకునే ప్రతిపాదనను ఆయన అధిష్టానం ముందు పెట్టనున్నారు. ప్రజారాజ్యం పార్టీకి చెందిన సి. రామచంద్రయ్యను, గంటా శ్రీనివాస రావును తీసుకోవడానికి ఆయన ఈ నెల 19వ తేదీన మంత్రి వర్గ విస్తరణ చేపట్టనున్నారు. ఇదే సమయంలో పాత మంత్రులకు ముగ్గురికి ఉద్వాసన పలికి, మరో ముగ్గురిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి యోచిస్తున్నారు.

జౌళి శాఖ మంత్రి పి. శంకరరావు, మైనారిటీ సంక్షేమ మంత్రి అహ్మదుల్లా, స్టాంపులు - రిజిస్ట్రేషన్ల మంత్రి తోట నర్సింహాలను తొలగించాలని ఆయన అనుకుంటున్నట్లు సమాచారం. పి. శంకరరావు బహిరంగ విమర్శలు చేస్తూ కొరకరాని కొయ్యగా మారడంతో ఆయనను తొలగించి, తెలంగాణ నుంచి సంగారెడ్డి శాసనసభ్యుడు జగ్గారెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది. కడప జిల్లా నుంచి సి. రామచంద్రయ్య చిరంజీవి అభ్యర్థిగా మంత్రివర్గంలోకి తీసుకుంటున్నందున ఆ జిల్లా విషయంలో సమతుల్యత పాటించడానికి అహ్మదుల్లాను తొలగించాలని ఆయన భావిస్తున్నారు. ఆయన స్థానంలో ఎమ్మెల్సీ మహ్మద్ జానీకి మంత్రి పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రి యోచిస్తున్నట్లు చెబుతున్నారు. కాగా, తనకు అత్యంత సన్నిహితుడైన ఎమ్మెల్సీ రంగారెడ్డిని ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రతినిధిగా ఢిల్లీలో నియమించాలనే ఆలోచనలో కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+