తెలంగాణలో వైయస్ జగన్ పాదయాత్రకు ప్లాన్?

ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టును, పోలవరం ప్రాజెక్టును దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం జగన్ గతంలో పాదయాత్ర చేశారు. ఈ రెండు ప్రాజెక్టులను వెంటనే చేపట్టాలని జగన్ డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ ప్రజల మనసు దోచుకోవడానికి ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు కోసం పాదయాత్ర చేయాలని వైయస్ జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. తెలంగాణ భూములకు సాగునీరు అందించడానికి వైయస్ రాజశేఖర రెడ్డి ఈ ప్రాజెక్టును తలపెట్టారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు కోసం తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా పాదయాత్రలు తలపెట్టారు.












Click it and Unblock the Notifications