హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌పై పుల్లా పద్మావతి అలక: శోభా నాగిరెడ్డి చర్చలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Pulla Padmavathi
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆయన వర్గానికి చెందిన కాంగ్రెసు ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి అలక వహించారు. దీంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ఆమెను బుజ్జగించడానికి రంగంలోకి దిగారు. శాసనసభ్యురాలు శోభా నాగిరెడ్డి పుల్లాపద్మావతి, భాస్కర్ దంపతులతో ఆమె చర్చలు జరిపారు. మంగళవారంనాడు ఆమె గంటపాటు పుల్లా పద్మావతి దంపతులతో చర్చలు జరిపారు. దాంతో పుల్లా పద్మావతి దంపతులు అలక వీడినట్లు చెబుతున్నారు. దీంతో పుల్లా పద్మావతి దంపతులు ఓదార్పు యాత్రలో ఉన్న వైయస్ జగన్‌ను కలవడానికి గుంటూరు జిల్లాకు వెళ్లే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

తనకు పార్టీలో తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని పుల్లా పద్మావతి వైయస్ జగన్‌పై అలక వహించినట్లు చెబుతున్నారు. దాంతో ఆమె నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో జరిగిన జగన్ రైతు దీక్షకు కూడా హాజరు కాలేదు. తెలంగాణకు చెందిన పుల్లా పద్మావతి తెలంగాణలో జరిగిన జగన్ కార్యక్రమానికి హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో వైయస్ జగన్ ఆదేశాల మేరకు శోభా నాగిరెడ్డి పుల్లా పద్మావతి దంపతులతో చర్చలు జరిపినట్లు చెబుతున్నారు. కాంగ్రెసు నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన పుల్లా పద్మావతి మొదటి నుంచి జగన్ వెంట నడుస్తున్నారు.

English summary
YSR Congress leaders Shobha Nagireddy has held talks with MLC Pulla Padmavathi, who is unhappy with party president YS Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X