హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిఎం విలువ తగ్గించేలా ఉండదు, బాధపడ్డాను: బొత్స

By Srinivas
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విలువ తగ్గించేలా పార్టీ నడవదని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ గురువారం ఓ టీవి ఛానల్ ముఖాముఖిలో చెప్పారు. సిఎంకు తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. బెట్టులో తానే నెగ్గానన్న వార్తలు చూసి బాధపడ్డానన్నారు. సిఎం మాట నెగ్గించుకోలేక పోయారన్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. తన జోడు పదవుల విషయంపై ముఖ్యమంత్రి గాని, అధిష్టానం గాని ప్రస్తావించలేదన్నారు. సిఎం అందరికీ న్యాయం చేస్తారని చెప్పారు. మంత్రుల శాఖల్లో మార్పులు చేర్పులు చేయాలనుకున్నామని, త్వరలో అవి ఉంటాయన్నారు. చిరంజీవి వర్గం నేతల పదవులకు, తెలంగాణకు ముడిపెట్టవద్దని కోరారు. అవసరమైన పక్షంలో శాసనమండలి సభ్యులను కూడా మంత్రివర్గంలోకి తీసుకుంటారన్నారు.

మంత్రిగా శంకర రావును తొలగిస్తాన్న ప్రచారంపై స్పందిస్తూ ఆ ప్రక్రియ జరిగాక అడగాలన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి విషయంలో కాంగ్రెసు శంకర రావును వాడుకొని వదిలేసిందనటం సరికాదన్నారు. ఆ విషయాలపై తర్వాత మాట్లాడతానన్నారు. పార్టీలో అన్ని ప్రాంతాల వారికి, అన్ని వర్గాల వారికి సమ న్యాయం జరుగుతుందన్నారు.

English summary
PCC chief Botsa Satyanarayana said that he has no differences with CM Kiran Kumar Reddy. He appealed Telangana leaders that do not compare Chiranjeevi camp posts with Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X