సిఎం కిరణ్ కుమార్‌కు అధిష్టానం నో ఎందుకు చెప్పింది?

Kiran Kumar Reddy
హైదరాబాద్: మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు అనుమతించాలన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెసు పార్టీ అధిష్టానం ఎందుకు నో చెప్పిందనే అంశంపై తాజాగా చర్చ జరుగుతోంది. ఎప్పటి నుండో తన మార్క్ ఉన్న కేబినెట్ కోసం సిఎం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందుకోసం పలుమార్లు ఢిల్లీకి వెళ్లారు. ఇటీవల చిరంజీవి వర్గం నేతలకు పదవులు కేటాయించాల్సి రావడంతో సిఎంకు పునర్వ్యవస్థీకరణపై కోరేందుకు మరోసారి అవకాశం వచ్చింది. చిరు నేతలతో కేవలం విస్తరణకు కాకుండా పునర్వ్యవస్థీకరణకు అనుమతించాలని ఆయన ఢిల్లీ పెద్దలకు విజ్ఞప్తి చేశారు. కానీ ఆయన కోరికపై అధిష్టానం మళ్లీ నీళ్లు చల్లింది. పిఆర్పీ నేతలు ఇద్దరిని మంత్రివర్గంలోకి తీసుకోవడంతో సరిపెట్టుకోవాలని సూచించింది. నిత్యం తనపై, తన కేబినెట్‌పై ఒంటికాలిపై లేస్తున్న మంత్రి శంకర రావును తప్పించడానికి అధిష్టానం అనుమతినివ్వడం మినహా సిఎంకు సంతృప్తినిచ్చిన అంశమేదీ లేదనే చెప్పవచ్చు. పునర్వ్యవస్థీకరణకు అనుమతివ్వక పోవడం వెనుక పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ తదితరులు ఉన్నారన్న ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.

అయితే బొత్సతో పాటు పలు అంశాలను అధిష్టానం పరిగణలోకి తీసుకుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో ప్రభుత్వం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఓ వైపు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, మరోవైపు తెలంగాణ సమస్య ఉన్న ప్రస్తుత తరుణంలో పునర్వ్యవస్థీకరణ పార్టీని మళ్లీ సంకట స్థితిలో పడేస్తుందని అధిష్టానం భావించినట్లుగా సమాచారం. తెలంగాణ ఉద్యమం చల్లబడినప్పటికీ దాని ప్రభావం ఇంకా కొనసాగుతోంది. మరోవైపు జగన్ ఆస్తుల కేసులో ఇరుక్కున్నప్పటికీ సానుభూతి పవనాలు వీస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పునర్వ్యవస్థీకరణ చేస్తే ఉద్యమం, జగన్ పేరుతో అసంతృప్తులు ఎవరైనా పార్టీకి దూరమయ్యే అవకాశాలను కూడా అధిష్టానం పరిగణలోకి తీసుకొని ఉండవచ్చునని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+