గుంటూరు ఓదార్పులో వైయస్ జగన్పై కోడిగుడ్ల దాడి
వెంటనే స్పందించిన ఆయన భద్రతా సిబ్బంది ఘటనకు బాధ్యులైన వారిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారిపోయింది. ఈ క్రమంలో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. పోలీసులు వ్యవహరించిన తీరుపట్ల గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మా ఊరికి వచ్చి మాపైనే దాడి చేస్తారా అంటూ భద్రతా సిబ్బందిపై మండిపడ్డారు. జగన్ కాన్వాయ్లోని ఒక అద్దం పగులగొట్టారు. పోలీసులు రంగంలోకి దిగి వారిని చెదరగొట్టడంతో జగన్ పర్యటన కొనసాగింది.
Comments
English summary
YSR Congress Party chief YS Jaganmohan Reddy greeted with eggs in his Guntur district odarpu yatra yesterday night.
Story first published: Thursday, January 19, 2012, 8:31 [IST]