హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరంజీవి నమ్మిన వారిని మోసం చేశారు: తలసాని

By Srinivas
|
Google Oneindia TeluguNews

Talasani Srinivas Yadav
హైదరాబాద్: తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి తనను నమ్ముకున్న వారిని నట్టేట ముంచారని తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం అన్నారు. వనస్థలిపురంలో ఆయన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెసు పార్టీకి చిరంజీవి స్టెప్నీ వంటి వాడని, నమ్ముకున్న వారిని నట్టేట ముంచిన మోసగాడని ఆరోపించారు. ఢిల్లీలో పదవుల కోసం కాంగ్రెసు పార్టీ అధిష్టానం ముందు మోకరిల్లుతున్నారని విమర్శించారు. తన పార్టీ వారికే న్యాయం చేయలేని స్థితిలో ఢిల్లీలో బిచ్చమెత్తుకుంటున్నారని ఇక సామాన్యులకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. చిరంజీవి ఎన్టీఆర్‌కు సరిరారన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ నిర్ణయాలతో పబ్బం గడుపుతూ అసమర్థ సిఎం అనిపించుకుంటున్నారన్నారు.

తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆర్థిక సంస్కరణతోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగు పడిందన్నారు. కాగా నగరంలో పలు ప్రాంతాల్లో ఎన్టీఆర్‌కు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. హాస్పిటల్స్‌లో రోగులకు పాలు, పండ్లు పంచి పెట్టారు. చంద్రబాబు రసూల్ పుర వద్ద అమరజ్యోతి ర్యాలీ ప్రారంభించారు. బాలకృష్ణ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌లో ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు.

English summary
TDP leader Talasani Srinivas Yadav lashes out at Tirupati MLA Chiranjeevi. He said Chiru is extra player for Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X