మాది వైయస్ జగన్, చంద్రబాబు పార్టీల్లా కాదు: బొత్స
ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే ఎన్నికలు జరుగుతాయని ఆయన అన్నారు. చిరంజీవికి తమ పార్టీ శానససభ్యుడిగా, నాయకుడిగా గౌరవం ఉంటుందని ఆయన అన్నారు. శంకరరావును తాము మంత్రి వర్గం నుంచి గెంటేయలేదని ఆయన అన్నారు. శంకరరావే వెళ్లి పోయే పరిస్థితి తెచ్చుకున్నారని ఆయన అన్నారు. పార్టీని ఎలా బలోపేతం చేసుకోవాలో తమకు తెలుసునని ఆయన అన్నారు. 2014 వరకు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారని, ముఖ్యమంత్రి నేతృత్వంలోనే ఎన్నికలను ఎదుర్కుంటామని ఆయన చెప్పారు. జోడు పదవుల గురించి ఏ వేదికలోనూ చర్చ జరగలేదని ఆయన చెప్పారు. వర్గాన్ని, ప్రాంతాన్ని పరిగణనలోకి తీసుకుని చేస్తారని, వ్యక్తులను పరిగణనలోకి తీసుకుని చేయబోరని ఆయన చెప్పారు. అసంతృప్తిని నివారించేందుకు ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటారని ఆయన చెప్పారు.
రెవెన్యూ సదస్సులను విజయవంతం చేయాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలదే అని ఆయన అన్నారు. ప్రభుత్వపరంగా, పార్టీపరంగా, వ్యక్తిగతంగా ఏమైనా లోపాలుంటే సరిదిద్దుకుంటామని, మీడియా మాత్రం వాస్తవాలు తెలుసుకుని వార్తాకథనాలు రాయాలని ఆయన అన్నారు. ముఖ్యమంత్రితో తనకు విభేదాలు ఉన్నట్లు కథనాలు రాయడం సరి కాదని, ఏదైనా ఉంటే తమను అడిగితే వివరణ ఇస్తామని, తమను వివరణ అడిగి రాయాలని ఆయన సూచించారు. సోనియా గాంధీ నాయకత్వంలో తాను, ముఖ్యమంత్రి పార్టీని బలోపేతం చేయడానికి పనిచేస్తామని ఆయన చెప్పారు. రేపు గులాం నబీ ఆజాద్ నేతృత్వంలో సమన్వయ కమిటీ సమావేశం జరుగుతుందని ఆయన చెప్పారు. మంత్రి వర్గంలో కాపు వర్గానికి చెందినవారు నలుగురే ఉన్నారని ఆయన చెప్పారు.