విజయసాయికి లాప్టాప్ ఇస్తే కేసు తారుమారు!:సిబిఐ

అందుకు విజయ సాయి రెడ్డి తరఫు న్యాయవాది, జగన్ ఆస్తుల కేసులో సిబిఐ ఇప్పటికే అన్ని ఆధారాలు తీసుకుందని, అలాంటప్పుడు కేసు తారుమారు చేసే అవకాశం ఎక్కడిదని వాదించారు. కేసు తారుమారయ్యే అవకాశం లేదు కాబట్టి లాప్ టాప్ వినియోగించుకునే అవకాశమివ్వాలన్నారు. కాగా ఇరువురి వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను ఈ నెల 23వ తేదికి వాయిదా వేసింది. కాగా ఇటీవల విజయ సాయి రెడ్డి తనకు లాప్ టాప్ లేదా కంప్యూటర్ ఇవ్వాలని, ఇంటర్ నెట్ ఉపయోగించుకోనని సిబిఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications