రాజీనామా చేసి గెలిస్తే మాట వింటాం: ఎర్రబెల్లికి నాయిని
మోత్కుపల్లి నర్సింహులు, ఎర్రబెల్లిలని జనమే తరిమికొట్టే రోజు వస్తుందన్నారు. చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతూ ఇష్టానుసారం మాట్లాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, సిగ్గు, నీతి, నిజాయితీ ఉంటే కెసిఆర్పై తప్పుడు మాటలు మానుకోవాలని హెచ్చరించారు. కాగా, హైదరాబాద్లో అపార్ట్మెంట్లలో కొనసాగుతున్న కళాశాలలన్నింటినీ శివారుల్లోకి మార్చాలని నాయిని డిమాండ్ చేశారు. అక్కడైతే ఆట స్థలాలు, ఇతర వసతులు కల్పించే అవకాశం ఉంటుందని, ఈ విషయమై ఆలోచన చేయాలని కోరారు. ముగ్గురు మంత్రులున్నా విద్యా విధానం సరిగాలేదని, చివరికి కేంద్రం ఇచ్చే నిధులను కూడా సక్రమంగా వినియోగించుకోలేని చేతగానిస్థితిలో ప్రభుత్వం ఉన్నదన్నారు.
సకల జనుల సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులను ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోందని ఎమ్మెల్యే కె తారక రామారావు సిరిసిల్లలో అన్నారు. చౌటుప్పల్ డిఎస్పీ ఉద్యమంలో పాల్గొన్న 19 మంది విద్యార్థులపై రౌడీషీట్ పెడతామంటూ బెదిరిస్తున్నారని, విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తెలంగాణ ఆకాంక్షను మరింత శక్తిమంతంగా చాటడానికి పోరాటం ఉధృతం చేస్తామని, పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు తెలంగాణ సెగ తగిలేలా ఈ ఉద్యమం ఉంటుందన్నారు.