వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌పైనా పోటీకి రెడీ: గర్జిస్తున్న సింహా బాలకృష్ణ

By Pratap
|
Google Oneindia TeluguNews

Balakrishna
విశాఖపట్నం: చిరంజీవిపై పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ఆదివారంనాడు ప్రకటించిన తెలుగుదేశం పార్టీ నాయకుడు, సినీ హీరో బాలకృష్ణ సోమవారంనాడు మరో సంచలన ప్రకటన చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై కూడా పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఆయన ప్రకటించారు. విశాఖపట్నం జిల్లా పెదవాల్తేరులో ఆయన సోమవారం స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. వైయస్ రాజశేఖర రెడ్డిపై విమర్శలు చేస్తూ, ఎన్టీ రామారావు సంక్షేప పథకాలను ప్రస్తావిస్తూ ఆయన ప్రసంగం సాగింది. విగ్రహాల రాజకీయాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రాన్ని దోచేసినవారికి విగ్రహాలు నెలకొల్పుతున్నారని ఆయన వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాల స్థాపనపై వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ కోసం తాను శ్రమిస్తానని ఆయన చెప్పారు. విశాఖ సభలో స్థానిక సమస్యలను కూడా ఆయన ప్రస్తావించారు.

తనను నటుడిగా ఆదరించారని, రాజకీయాల్లోనూ ఆదరించాలని ఆయన కోరారు. కార్యకర్తలు, అభిమానులు వేరు కాదని ఆయన అన్నారు. సినీరంగంలో ఎన్టీ రామారావు మగధీరుడని ఆయన అన్నారు. ప్రతిపక్షాలను ఏకం చేసి అధికార కాంగ్రెసును ఓడించిన ఘనత ఎన్టీ రామారావుదని ఆయన అన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో అపహాస్యం చేస్తున్న సమయంలో తెలుగు జాతిని ఉత్తేజపరిచి, తెలుగు కీర్తిపతాకను ప్రపంచ నలుదిశలా వ్యాపింపజేసిన మహా నాయకుడు ఎన్టీ రామారావు అని ఆయన అన్నారు. ప్రస్తుతం అమలు చేస్తున్న రూపాయికి కిలో బియ్యం పథకం ఆనాడు ఎన్టీఆర్ రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం నుంచి పుట్టిందేనని ఆయన అన్నారు.

బడుగు బలహీన వర్గాలను ఆదుకునే నాథుడు లేని సమయంలో ఎన్టీ రామారావు నిస్వార్థ సేవా కాంక్షతో రాజకీయాల్లోకి వచ్చి తొమ్మిది నెలల వ్యవధిలోనే కాంగ్రెసు పార్టీని ఓడించి ముఖ్యమంత్రి అయ్యారని ఆయన అన్నారు. అన్ని రంగాల్లోని ప్రతిభావంతులను గుర్తించి వారికి తగిన స్థానాలు కల్పించారని ఆయన అన్నారు. ప్రజాధనాన్ని కుటుంబ సభ్యులకు దొచిపెట్టిన నేతల విగ్రహాలు వెలుస్తున్నాయన్నారు. తాను ఎన్నికల్లో టిక్కెట్లు అమ్ముకోలేదని, అధికారం కోసం పార్టీని అమ్ముకోలేదని చిరంజీవిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ కాలిగోటికి ఎవరూ సరిపోరన్నారు. కొందరు నన్ను బాలుడు అన్నారని, ఐతే అలాంటి వారు తనను ఒకవైపే చూశారని రెండోవైపు ఇంకా చూడలేదన్నారు.

English summary
TDP leader and hero Balakrishna said that he ready to contest on YSR Congress president YS Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X