వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సునీల్ కస్డడీకి, సాయి రెడ్డి నార్కో టెస్టుకు సిబిఐ పిటిషన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vijaya Sai Reddy-Sunil Reddy
హైదరాబాద్: ఎమ్మార్ కేసులో అరెస్టైన సునీల్ రెడ్డికి సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం బుధవారం ఫిబ్రవరి 1వ తేది వరకు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. సిబిఐ కూడా సునీల్ రెడ్డిని తమ కస్టడీలోకి పదిహేను రోజులు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేసింది. సిబిఐ పిటిషన్‌పై విచారణను కోర్టు ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది. కాగా మంగళవారం సాయంత్రం తాము సునీల్ రెడ్డిని అరెస్టు చేసినట్లు సిబిఐ అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. అంతకుముందు రెండు రోజులుగా సునీల్ రెడ్డిని సిబిఐ అధికారులు రహస్యంగా విచారించినట్లుగా తెలుస్తోంది. ఎమ్మార్ కేసులో కోనేరు ప్రసాద్, కోనేరు రంగా రావు, సునీల్ రెడ్డిలదే కీలక పాత్ర అని సిబిఐ రిమాండ్ రిపోర్టులో తెలిపింది. విల్లాల యజమానుల నుండి డబ్బులు వసూలు చేసింది రంగారావు, సునీల్ రెడ్డిలే అని పేర్కొంది. విల్లాల డబ్బు తరలింపు మర్మం సునీల్ రెడ్డికే తెలుసునని చెప్పింది.

జగన్ కేసులోనే అరెస్టైన జగతి పబ్లికేషన్ వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డికి నార్కో టెస్ట్‌కు అనుమతివ్వాలని సిబిఐ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గతంలో పలుమార్లు ఆయనను విచారించినప్పటికీ, రిమాండులోకి తీసుకొని విచారిస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో సమాధానాలు రాబట్ట లేకపోతున్నందున నార్కో టెస్టుకు అనుమతించాలని కోరారు. ఈ పిటిషన్‌ను 30వ తేదికి వాయిదా వేశారు. కాగా ఓఎంసి కేసులో అరెస్టైన ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి కోర్టు ఫిబ్రవరి 8వ తేది వరకు రిమాండ్ పొడిగించింది. శ్రీలక్ష్మిని చంచల్ గూడ మహిళా జైలులో ప్రత్యేక ఖైదీగా పరిగణించాలని కోర్టు ఆదేశించింది.

English summary
Sunil Reddy remanded for weekdays, who was arrested in YSR Congress Party chief YS Jaganmohan Reddy properties case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X