జగన్ సహన కోల్పోతున్నారా, అందుకే వ్యాఖ్యలా?

పులివెందులకు చెందినవారు రెడ్డి అయితే చాలు, ఏదో విధంగా వేధింపులకు గురిచేస్తున్నారని ఆయన అన్నారు. సిబిఐ అమాయకులను వేధిస్తోందని ఆయన విమర్శించారు. తీవ్ర మనస్తాపానికి గురైనట్లు ఆయన వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. కాగా, గుంటూరు జిల్లాలో ఓదార్పు యాత్ర చేస్తున్న జగన్ ఈ నెల 27వ తేదీన వస్త్రవ్యాపారుల సమ్మెకు మద్దతుగా నర్సారావుపేటలో జరిగే ధర్నా కార్యక్రమంలో పాల్గొంటారు. తనకు సంబంధించిన వాస్తవాలు బయటకు వస్తాయని భయపడే జగన్ అనవసరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని తెలుగుదేశం నాయకులు దూళిపాళ నరేంద్ర తదితరులు విమర్శించారు. విజయసాయి రెడ్డి, సునీల్ రెడ్డి తర్వాత అరెస్టు తానే అవుతానని జగన్ అనుకుంటున్నారని వారు బుధవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
తనకు సునీల్ రెడ్డి ఎలా బంధువుతారో చెప్పాలని అడిగిన ప్రశ్నకు విరుద్ధంగా ఆయనకు చెందిన సాక్షి దినపత్రికలో ఓ వార్తాకథనానికి శీర్షికను పెట్టారు. వైయస్ బంధువు సునీల్ రెడ్డి అరెస్టు అంటూ ఆ శీర్షికను పెట్టారు. అయితే, సునీల్ రెడ్డిని సిబిఐ అదుపులోకి తీసుకున్న తీరును ప్రశ్నిస్తూ సాక్షి దినపత్రిక పెద్ద వార్తాకథనాన్ని ప్రచురించింది. సునీల్ లాంటి వైయస్ బంధువులను సిబిఐ టార్గెట్ చేస్తూ పావులు కదుపుతోందని విమర్శించింది. ఓఎంసి, సాక్షి పెట్టుబడులు, ఎమ్మార్ కేసు ఏదైనా లక్ష్యం జగనే అని వ్యాఖ్యానించింది.












Click it and Unblock the Notifications