ఎన్టీఆర్ విగ్రహాలపై దాడి: ఓ చోట నిప్పు, మరో చోట ధ్వంసం
గుంటూరు జిల్లా చెరుకుపల్లి గ్రామంలో ఎన్టీ రామారావు విగ్రహానికి దండగులు నిప్పు పెట్టారు. దీంతో అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని మహేంద్రవాడలో దుండగులు ఎన్టీ రామారావు విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దీంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వారి ఆందోళన కారణంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇటీవల నల్లగొండ జిల్లా కోదాడలో కూడా ఎన్టీ రామారావు విగ్రహంపై దాడి జరిగింది. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహాలపై కూడా దాడులు జరిగాయి.
Comments
English summary
NT Rama Rao statues were attacked in two places in Andhra Pradesh today.
Story first published: Wednesday, January 25, 2012, 18:02 [IST]