హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు జైలు ఊచలు లెక్కిస్తుండేవాడు: బొత్స

By Pratap
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
హైదరాబాద్: కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకోకుండా ఉంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జైలు ఊచలు లెక్కిస్తుండేవాడని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. రైతు సమస్యలపై తమ ప్రభుత్వాన్ని, మద్యవ్యాపారం గురించి తనను తప్పుపడుతూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఆయన గురువారం మీడియా ప్రతినిదుల సమావేశంలో తీవ్రంగా ధ్వజమెత్తారు. తనపై వచ్చిన ఆరోపణల మీద తాను విచారణకు సిద్ధపడ్డానని, చంద్రబాబు తనపై కేసులో వేస్తే విచారణకు సిద్ధపడకుండా స్టేలు తెచ్చుకున్నారని, స్టేలు తెచ్చుకోకపోతే చంద్రబాబు ఊచలు లెక్కిస్తుండేవాడని తాను ఇదివరకు కూడా చెప్పానని ఆయన అన్నారు. వ్యవసాయాన్ని లాభసాటి చేస్తానని చెబుతున్న చంద్రబాబు అధికారంలో ఉన్న తొమ్మిదేళ్లు ఏం చేశారని ఆయన అడిగారు.

చంద్రబాబు రైతు పోరు బాట వల్ల ఒరిగేదమీ లేదని ఆయన అన్నారు. రైతులకు గిట్టుబాటు ధర ఎలా ఇప్పించాలి, వారికి ఎలా సాయం అందించాలని తాము ఆలోచిస్తున్నామని, చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయాన్ని పట్టించుకోలేదని ఆయన అన్నారు. చంద్రబాబు ఎన్ని చెప్పుకున్న లాభం ఏమీ లేదని ఆయన అన్నారు. ఎదుటివారి మీద విమర్శలు చేసే ముందు మనమేమిటో చూసుకోవాలని ఆయన చంద్రబాబుకు సూచించారు. మద్యం వ్యాపారం విషయంలో చంద్రబాబు చేస్తున్న ఆరోపణలు అర్థరహితమని ఆయన అన్నారు.

English summary
PCC President Botsa Satyanarayana has retaliated TDP president N Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X