జెండాకు, మహాత్ముడికి అవమానం: మరోవైపు పూజలు

గణతంత్ర దినోత్సవం రోజు కొన్నిచోట్ల జెండాకు, గాంధీకి అవమానం జరగ్గా మెదక్ జిల్లాలోని కొండాపూర్లో పూజలు చేశారు. మహాత్ముడికి గ్రామస్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఆ గ్రామానికి గాంధీజీయే దేవుడు. దేశానికి స్వాతంత్రం తీసుకు వచ్చిన మహాత్ముడు అంటే తమకు ఎంతో అభిమానమని, ప్రతి అక్టోబర్ 2, ఆగస్టు 15, జనవరి 26 నాడు మహాత్ముడికి అభిషేకాలు, అర్చనలు, పూజలు చేస్తామని చెబుతున్నారు. నలభయ్యేళ్ల క్రితం తమ గ్రామ సర్పంచ్ గాంధీజీ విగ్రహాన్ని ఆవిష్కరించారని అప్పటి నుండి ఇది కొనసాగుతోందని చెబుతున్నారు. ప్రతి శుక్రవారం ఆయనకు పూజలు కూడా చేస్తారట.












Click it and Unblock the Notifications