భానుకిరణ్ కోసం ప్రత్యేక టీమ్స్తో గాలింపు: డిజిపి దినేష్

మహిళలపై వేధింపులు అరికట్టేందుకు త్వరలో గ్రీవెన్ సెల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇక నుండి ఎస్ఐల ప్రమోషన్లు జోన్ల వారిగా కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి చేస్తామన్నారు. యానాం రీజెన్సీ కంపెనీ ఘటనపై స్పందిస్తూ.. కాకినాడ నుండి యానాంకు పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చేందుకు పోలీసు బలగాలను పంపించామని చెప్పారు. కాగా అమలాపురం నియోజకవర్గంలో మంత్రివర్గ బృందం అంబేడ్కర్ విగ్రహాలు ధ్వంసమైన చోట పరిశీలించింది. ఘటనకు బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు మంత్రివర్గ సంఘాన్ని కోరాయి.












Click it and Unblock the Notifications