మణిపూర్ ఎన్నికల్లో హింస, ఐదుగురు మృతి
ఎదురుకాల్పుల్లో ఓ సిఆర్పిఎఫ్ జవానతో పాటు ఓ మహిళ, ముగ్గురు అధికారులు మరణించినట్లు సమాచారం. మణిపూర్ శానససభ ఎన్నికల ఎన్నికల నేపథ్యంలో సిఆర్పిఎఫ్ జవాన్లపై మిలిటెంట్లు శుక్రవారం సాయంత్రం మెరుపు దాడి చేశారు. ఈ మెరుపు దాడిలో ఇద్దరు సిఆర్పిఎఫ్ జవాన్లు మరణించారు. పోలింగు స్టేషన్ల సమీపంలో పాతిపెట్టిన నాలుగు శక్తివంతమైన బాంబులను స్వాధీనం చేసుకున్నారు. వాటిని నిర్వీర్యం చేశారు. ఉక్రుల్ జిల్లాలో మిలిటెంట్లు శుక్రవారం సాయంత్రం మెరుపు దాడి చేశారు. శనివారం స్వాధీనం చేసుకున్న బాంబులను మిలిటెంట్లు పాతిపెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. పోలింగ్ను అడ్డుకోవడానికి మిలిటెంట్లు ఆ పనికి పూనుకుని ఉంటారని అనుమానిస్తున్నారు.
గత గురువారంనాడు 80 ఏళ్ల మహిళ మరణించింది. తమెన్గాంగ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మిలిటెంట్లు బాంబులతో కాంగ్రెసు పార్టీ కార్యాలయంపై దాడి చేశారు. ఈ సంఘటనలో మహిళ మరణించింది.