ప్రధాని హైదరాబాద్ పర్యటన రద్దు వెనక ఎంపిల లేఖ
ప్రజల్లో దీనిపై ఎన్నో అనుమానాలు, అపోహలు ఉన్నాయని, ప్రైవేటు కంపెనీల యజమానులు తమకు అనుకూలురైన సిబ్బందిని మాత్రమే నియమించుకుంటారని, ప్రభుత్వ సిఫారసుల మేరకు ఉద్యోగం ఇచ్చినా వారి సామర్థ్యం పరిశీలించి, తమకు అనువుగా లేకుంటే పక్కకు తప్పిస్తారని అశాశ్వతమైన ప్రైవేటు ఉద్యోగాలను కల్పించే పథకానికి అట్టహాసంగా ప్రారంభోత్సవాలను నిర్వహించడం మంచిదా, కాదా ఆలోచించుకోవాలని ప్రధానికి రాసిన లేఖలో వారు వివరించినట్లు తెలిసింది. రాజీవ్ యువ కిరణాల కింద ప్రభుత్వ రంగ సంస్థలలో నియామకాలు జరుగుతున్నట్లు యువత భావిస్తోందని, అందుకు విరుద్ధంగా ప్రైవేటు సంస్థల్లో వెల్డర్లు, ఫిట్టర్లు వంటి చిన్న చిన్న ఉద్యోగాలను ఇప్పించడం వల్ల ప్రభుత్వానికి ఒనగూరే ప్రయోజనం ఏమిటని కూడా అందులో ప్రశ్నించారు.
Comments
English summary
It is said that PM Manmohan Singh has cancelled his Hydearabad visit due to MPs letter.
Story first published: Monday, January 30, 2012, 8:59 [IST]