ఇక్కడ చంద్రబాబు: అక్కడ తెరాస అధినేత కెసిఆర్

Chandrababu Naidu-K Chandrasekhar Rao
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వస్త్రవ్యాపారుల ధర్నా శిబిరాన్ని సందర్శించి వారికి మద్దతు తెలుపగా, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు జూనియర్ డాక్టర్ల దీక్షా శిబిరాన్ని సందర్శించారు. ఇద్దరు నేతలు కూడా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రంగా ధ్వజమెత్తారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో వ్యాట్‌ను అమలు చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. మన రాష్ట్రంలోనే వ్యాట్ అధికంగా ఉందని ఆయన అన్నారు. వ్యాట్ అమలు ద్వారా ప్రభుత్వం వ్యాపారుల నడ్డి విరిచిందని ఆయన అన్నారు.

రాష్ట్రంలో ఎటు చూసినా ఆందోళనలే అని కెసిఆర్ అన్నారు. విద్యార్థులు, వస్త్రవ్యాపారులు, జూనియర్ డాక్టర్లు ఆందోళనలు చేస్తున్నారని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. ఆందోళనలు చేస్తే ఎస్మా ప్రయోగిస్తున్నారని ఆయన అన్నారు. జూడాల సమ్మె కొత్తది కాదని, స్టయిఫండ్ పెంపు కోసం వారు రాజీలేని పోరాటం చేస్తున్నారని ఆయన అన్నారు. మహిళా డాక్టర్లను కూడా అరెస్టు చేస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వ్యోద్యోగులు 40 రోజులు సమ్మె చేసినా ఏమీ చేయలేకపోయారని, జూడాలు ఏం చేస్తారని ముఖ్యమంత్రి అనడం దారుణమని ఆయన అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి విజ్ఞతతో వ్యవహరించాలని ఆయన సూచించారు. కిరణ్ కుమార్ రెడ్డి అహంకారపూరిత వైఖరిని అవలంబిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+