చిరంజీవి దయపై బతకడానికి సిగ్గులేదా?: సిఎంపై దాడి

Dadi Veerabhadra Rao
హైదరాబాద్: తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి దయమీద బతకడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సిగ్గు లేదా? అని తెలుగుదేశం పార్టీ నేత, శాసనమండలి సభ్యుడు దాడి వీరభద్ర రావు మంగళవారం మండిపడ్డారు. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో తనకు జరిగిన అవమానం శాసనమండలికి జరిగినట్లేనన్నారు. ఇది పెద్దల సభకు జరిగిన అవమానమన్నారు. దీనిపై సమావేశాల తొలిరోజే ప్రస్తావిస్తానని తెలిపారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఏ ముఖ్యమంత్రి అయినా ఫోన్లో ఆరా తీస్తారని, కానీ కిరణ్‌కు కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా పోయిందన్నారు. సూట్ కేసులు తీసుకు వస్తేనే క్యాంప్ ఆఫీసులోకి అనుమతిస్తారా? అని మండిపడ్డారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ దయాదాక్షిణ్యాల మీద కిరణ్ ముఖ్యమంత్రి అయ్యారని మండిపడ్డారు. చిరంజీవి దయతో ప్రభుత్వాన్ని నడుపుతూ సిగ్గు లేదా అని ప్రశ్నించారు.

సిఎం పేషీ తీరుకు నిరసనగా మండలి సమావేశాల్లో నిరాహార దీక్షకు దిగుతానని చెప్పారు. కిరణ్‌కు ఇంత అహంకారం ఉంటే ఎలా అన్నారు. పదవి శాశ్వతం కాదని వ్యక్తిత్వం ముఖ్యమన్నారు. కాగా జూడాల సమస్యలు పరిష్కరించాలని కోరేందుకు దాడి ఆధ్వర్యంలో టిడిపి నేతలు ఉదయం సిఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ సెక్యూరిటీ దాడిని లోపలకు అనుమతించలేదు. సిఎం పేషీకి సమాచారమందించిన స్పందించలేదు. కాగా ఆ తర్వాత ముఖ్యమంత్రి కిరణ్, దాడికి ఫోన్ చేసి ఉదయం జరగిన ఘటనపై క్షమాపణ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+