మీకూ ఎదురు కావచ్చు: తల్లి విజయమ్మ లేఖపై జగన్

రాష్ట్రంలోని పరిస్థితిని వైయస్ విజయమ్మ ప్రధానికి రాసిన లేఖలో వివరించారని ఆయన చెప్పారు. లేఖలను చదివిన తర్వాత ప్రధాని ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే రాశారని ఆయన అన్నారు. తన లేఖలో విజయమ్మ వాస్తవాలను వివరించారని ఆయన చెప్పారు. రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి కొనసాగుతోందని ఆయన విమర్శించారు. ఆయన మంగళవారం జూనియర్ డాక్టర్ల ఆమరణ నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించారు. జూనియర్ డాక్టర్ల ఆందోళనకు మద్దతు ప్రకటించారు. ప్రభుత్వం తీరుపై ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications