వైయస్ హయాంలోనే ఎమర్జెన్సీ: జగన్పై విహెచ్ ధ్వజం

జగన్ ఓదార్పు యాత్ర పేరుతో కాంగ్రెసు, తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పైన విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. పత్రిక, టివి ఉంది కదా అని ఇష్టమొచ్చినట్లు రాస్తున్నారని విమర్శించారు. సింపతి కోసమే జగన్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. విచారణ ద్వారా వాస్తవాలు బయటకొస్తాయన్నారు. అవినీతి నేతల వల్ల ఐఏఎస్ అధికారులు కూడా ఇప్పుడు జైళ్లో ఉన్నారన్నారు. కాంగ్రెసు అవినీతిని సహించదని, రాజా, కల్మాడీ వంటి నేతలను జైళ్లో పెట్టిందన్నారు. సిబిఐ జెడి లకాష్మీ నారాయణపై తమకు నమ్మకముందన్నారు. సిబిఐ దర్యాఫ్తు కక్షనో, ద్వేషమో కాదన్నారు. తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, వారి నుండి డబ్బు రికవరీ చేయాలని అన్నారు. అవినీతిపరులను జైలుకు పంపించాల్సిందేనన్నారు. అలాంటి శిక్షలతోనే అవినీతి చేసేందుకు ఎవరైనా భయపడతారన్నారు. కాగా ఈ అంశంపై ఆయన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కు లేఖ రాశారు.












Click it and Unblock the Notifications