కెసిఆర్ ఢిల్లీలో సీమాంధ్రవాది, ఇక్కడ ప్రత్యేకవాది: మోత్కుపల్లి

రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాల సమయంలో తాము గన్ పార్కు వద్ద ధర్నా చేస్తామని తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాల స్థితిగతులపై ఓ రోజంతా సభలో చర్చించాలని పట్టుబడుతామని ఆయన చెప్పారు. తెలంగాణలోని పది జిల్లాల్లో తిరిగి అమర వీరుల కుటుంబాలను కలుసుకుంటామని ఆయన చెప్పారు. అమర వీరుల కుటుంబాలను ఆదుకోవడానికి కెసిఆర్ ముందుకు రావడం లేదని ఆయన విమర్సించారు. వచ్చే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బిల్లు ప్రతిపాదించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తేయాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications