ఐఎఎస్ల అరెస్టుకు వైయస్ కారణం: చంద్రబాబు

వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో అవినీతి, అక్రమాలకు పాల్పడినవారి వివరాలను వెల్లడించేందుకు ఐఎఎస్ అధికారులు ముందుకు రావాలని తెలుగుదేశం పార్టీ నాయకులు కోరారు. తప్పు జరిగిందని అంగీకరిస్తే సరిపోదని, ఏయే తప్పులు ఎవరి వల్ల జరిగాయనే విషయాలను బయట పెట్టాలని బాధ్యత అధికారులపై ఉందని తెలుగుదేశం పార్టీ నాయకుడు మండవ వెంకటేశ్వర రావు శనివారం హైదరాబాదులో మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. అవినీతి మంత్రులకు శిక్ష పడేలా వెంటనే నిజాలను సిబిఐ ముందు చెప్పాలని ఆయన ఐఎఎస్ అధికారులకు సూచించారు. ఐఎఎస్, ఐపియస్ వ్యవస్థల మధ్య చిచ్చు పెట్టి అసలు సమస్యలను పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని ఆనయ అన్నారు. ఐఎఎస్ అధికారులతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జరిపిన చర్చల వివరాలను ముఖ్యమంత్రి తక్షణం వెల్లడించాలని మరో నేత బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications