వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీలో అపాయింట్‌మెంట్లు దొరక్క సిఎం పడిగాపులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
న్యూఢిల్లీ: తమ కాంగ్రెసు పార్టీ అధిష్టానం పెద్దల అపాయింట్‌మెంట్ల కోసం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పడిగాపులు పడాల్సి వస్తోంది. మంత్రి విస్తరణకు అనుమతి పొందడానికి శనివారం ఉదయం ఢిల్లీ వచ్చిన ఆయన పెద్దల అపాయింట్‌మెంట్లు దొరకక ఇబ్బంది పడుతున్నారు. ఆయన అపాయింట్‌మెంట్ల కోసం ఎపి భవన్‌లో ఉదయం నుంచీ వేచి చూస్తున్నారు. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంలో కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం పాత్రపై పాటియాలా హౌస్ కోర్టు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో పార్టీ అధిష్టానం పెద్దలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. దాంతో ముఖ్యమంత్రిని కలుసుకోవడానికి వారు సమయం కేటాయించడం లేదని తెలుస్తోంది. చిదంబరంపై కోర్టు నిర్ణయం వెలువడిన తర్వాత ఆయనకు అపాయింట్‌మెంట్లు దొరికే అవకాశం ఉంది.

కాగా, శాసనసభ బడ్జెట్ సమావేశాల్లోగా తెలంగాణ నుంచి ముగ్గురు మంత్రులను తీసుకోవాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నారు. సమావేశాల్లోగానే తనదైన మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆయన భావిస్తున్నారు. అలా చేసుకుంటే తప్ప తెలంగాణలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో జరిగే ఉప ఎన్నికలను సమర్థంగా ఎదుర్కోలేమని ఆయన భావిస్తున్నారు. ఈసారి ఎలాగైనా మంత్రి వర్గ విస్తరణకు కాంగ్రెసు అధిష్టానం పెద్దల నుంచి అనుమతి పొందాలనే నిశ్చయంతో వచ్చారు. అయితే, ముఖ్యమంత్రికి పరిస్థితి అంత అనుకూలంగా కనిపించడం లేదు.

English summary
It is happened CM Kiran Kumar Reddy to wait for Congress high command leaders' appointments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X