హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏ ప్రలోభాలకు లొంగారో చెప్పాలి: ఎమ్మెల్సీ యాదవ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Yadav Reddy
హైదరాబాద్: ఏ విధమైన ప్రలోభాలకు లొంగి తెలంగాణ శానససభ్యులు తెలంగాణపై నోరు మూసుకున్నారని కాంగ్రెసు ఎమ్మెల్సీ యాదవ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణపై ఈ ప్రాంత శానససభ్యులు ఎందుకు మాట్లాడడం లేదో అర్థం కావడం లేదని, వారు ప్రలోభాలకు ఏమైనా లొంగి నోరెత్తడం లేదా అని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. వచ్చే శానససభ బడ్జెట్ సమావేశాల్లో పార్టీలకు అతీతంగా తెలంగాణ ప్రాంత శానససభ్యులు గొంతెత్తాలని ఆయన సూచించారు.

శాసన మండలి నైతిక విలువల కమిటీకి ఆయన రాజీనామా చేశారు. అనుభవం లేనివారిని, అమాయకులను కమిటీల్లో వేశారని ఆయన విమర్శించారు. చీఫ్ విప్ సూచనలను కూడా పాటించడం లేదని ఆయన విమర్శించారు. సీనియర్లను అగౌరవపరిచారని ఆయన అన్నారు. అనుభవం లేనివారిని, అమాయకులను కూడా వేయడం ద్వారా పొరపాట్లు చేశారని ఆయన అన్నారు. వివక్ష అనడానికి అవకాశం ఇచ్చారని ఆయన అన్నారు. శాసనమండలి కమిటీల విషయంలో కాంగ్రెసు సీనియర్ ఎమ్మెల్సీలు కునుకుల జనార్దన్ రెడ్డి, కెఆర్ ఆమోస్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. మండలి కమిటీల్లో తాము ఉండబోమని వారు ఇది వరకే ప్రకటించారు.

English summary
Congress MLC Yadav Reddy questioned Telangana MLAs that why they are not talking about Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X