కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ మనుషుల మధ్య పని చేయలేం: వైద్యులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Kadapa Map
కడప: వైయస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వర్గం మనుషుల మధ్య తాము వైద్య వృత్తి చేయలేమని అంటూ తమను అక్కడి నుంచి బదిలీ చేయాలని కడప జిల్లా పులివెందుల ఏరియా ఆసుపత్రి వైద్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తాము పూర్తిగా అసహాయ స్థితిలో ఉన్నామని ఆసుపత్రి వైద్యులు ఉమా మహేశ్వరి (రెగ్యులర్), సుభాషిణి, రాఘవేంద్ర కుమార్, శ్రీకల్పన ఆవేదన వ్యక్తం చేశారు.

కడప ప్రెస్‌క్లబ్‌లో శనివారం వారు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పులివెందుల పట్టణంలో ఇటీవల ఓ రోడ్డ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దివాకర్ అనే వ్యక్తి కొనఊపిరితో 108లో ఆసుపత్రికి వచ్చారని, చికిత్స చేస్తుండగానే మరణించారని వారు చెప్పారు. అయితే, దివాకర్ మృతికికి వైద్యులే బాధ్యులని జగన్ వర్గం మనుషులు ఆరోపిస్తూ పరుష పదజాలంతో దూషిస్తూ దాడి చేశారని ఆరోపించారు. ఓపీ విభాగం అద్దాలు ధ్వంసం చేసి సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేశారని చెప్పారు.

English summary

 Kadapa district Pulivendula area hospital staff alleged that YS Jagan followers are harassing them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X