కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అధికారిని దూషించిన కేసు: కోర్టుకు హాజరైన మంత్రి

By Srinivas
|
Google Oneindia TeluguNews

C Ramachandraiah
కడప: ఓ పోలీసు అధికారిని దూషించిన కేసులో విచారణ నిమిత్తం దేవాదాయ శాఖ మంత్రి సి.రామచంద్రయ్య సోమవారం కడప జిల్లాలోని రాజంపేట కోర్టుకు హాజరయ్యారు. రామచంద్రయ్య తెలుగుదేశం పార్టీలో ఉన్న సమయంలో 2006లో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా జెసిబితో అక్రమణలు తొలగిస్తుండగా ఓ భవనం కూలిపోయంది. ఈ ఘటనలో పది మంది మృతి చెందారు. ఈ ఘోర ప్రమాదానికి అధికారులు, పోలీసుల నిర్లక్ష్యమే కారణమంటూ అప్పట్లో రాజ్యసభ సభ్యుడిగా ఉన్న రామచంద్రయ్యతో పాటు మరో ఇరవై మంది అప్పటి ఏఎస్పీ లక్ష్మీరెడ్డిని దూషించారు. ప్రభుత్వాధికారిని దూషించారని, విధులకు ఆటంకం కలిగించారని రామచంద్రయ్యతో సహా ఇరవయ్యొక్క మందిపై కేసు నమోదైంది. అప్పటి నుండి దీనిపై విచారణ జరుగుతోంది.

ఈ కేసును ఉపసంహరిస్తూ ఈ జనవరి 13వ తేదిన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే విచారణ ఎదుర్కొంటున్న వారందరూ కోర్టుకు హాజరు కావాల్సిందేనని కోర్టు చెప్పింది. ఇటీవల రామచంద్రయ్య హాజరు కావాల్సి ఉన్నప్పటికీ గైర్హాజరయ్యారు. హాజరు కావాల్సిందేని కోర్టు చెప్పింది. దీంతో రామచంద్రయ్య ఈ రోజు కోర్టు ఎదుట హాజరయ్యారు.

English summary
Minister C Ramachandraiah attended at Rajampet court today for blaming police officer in 2006.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X