బాలకృష్ణతో ఒరిగేదిలేదు, అప్పుడే ఓడింది: లక్ష్మీపార్వతి
చంద్రబాబుతో ఎవరు జతకట్టినా ప్రజలు నమ్మరన్నారు. ఎమ్మార్కు మూల కారకుడు చంద్రబాబేనని ఆమె ఆరోపించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెసు ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మడం లేదన్నారు. ప్రజలు తమను నమ్మడం లేదని తెలిసే కాంగ్రెసు పార్టీ ఉప ఎన్నికలకు ధైర్యంగా వెళ్లడం లేదన్నారు. కాగా ఇటీవల తెలుగుదేశం పార్టీ తరఫున బాలకృష్ణ ప్రచారం చేసినప్పటి నుండి లక్ష్మీ పార్వతి ఆయన పైన కూడా విమర్శలు చేస్తున్నారు. టిడిపిని హస్తగతమైనా చేసుకోవాలని లేదా కొత్త పార్టీనైనా స్థాపిస్తేనే బాలయ్యకు ప్రజలు పట్టం గడతారని, బాబుతో ఉంటే నమ్మరని ఆమె పలుమార్లు సూచించారు.
Comments
laxmi parvathi balakrishna chandrababu naidu tirupati లక్ష్మీ పార్వతి బాలకృష్ణ చంద్రబాబు నాయుడు తిరుపతి
English summary
NTR TDP president Laxmi Parvathi said that Hero Balakrishna compaign will not use to Telugudesam Party. She accused TDP chief Chandrababu for EMAAR scam.
Story first published: Monday, February 6, 2012, 12:15 [IST]