చిరు వర్గానికే వస్తే అన్యాయమన్నారు: మంత్రి ఉత్తమ్

Uttam Kumar Reddy
హైదరాబాద్: గతంలో తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి వర్గం శాసనసభ్యులకు మాత్రమే మంత్రి పదవులు ఇచ్చినప్పుడు అన్యాయం జరిగిందని, ఇప్పుడు పదవులు తీసుకోవడాన్ని తప్పు పట్టడం ఏమిటని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం తెలంగాణవాదులను ప్రశ్నించారు. పదవులు తీసుకోవద్దని చెప్పడం సరికాదన్నారు. దామోదర రెడ్డికి కూడా మంత్రి పదవి వస్తే బాగుండేదని ఆయన అన్నారు. ఆయన సోదరుడికి పదవి ఉండటం వల్లనే ఆయనకు రాలేదని ఆయన అభిప్రాయపడ్డారు. తాను మంత్రిగా ఉన్నప్పటికీ తెలంగాణ కోసం పని చేస్తానన్నారు. పార్టీ అధిష్టానంతో ప్రత్యేక తెలంగాణపై చర్చిస్తానని అన్నారు. జిల్లా నేతలలో ఎవరితో తనకు విభేదాలు లేవన్నారు. అందరిని కలుపుకుపోయి పని చేస్తానని అన్నారు. మంత్రిగా ఉన్నప్పటికి తెలంగాణ రావాలనే కోరుకుంటున్నానని అన్నారు.

సీనియర్ ఎమ్మెల్యేగా గుర్తించారు కాబట్టే తనకు మంత్రి పదవి ఇచ్చినట్లుగా తాను భావిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో పేదలందరికీ సొంత ఇళ్లు నిర్మించడమే తన లక్ష్యమన్నారు. గృహనిర్మాణ శాఖ మంత్రిగా ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తానన్నారు. ఇంత పెద్ద కార్యక్రమం కాబట్టి కొన్ని పొరపాట్లు జరిగి ఉండవచ్చునని, ఇక నుండి అలాంటివి జరగకుండా ప్రయత్నిస్తానని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+