యుపి ప్రచారంలో రాహుల్ గాంధీ హైదరాబాద్ మంత్రం

మరోవైపు అమెథీలో రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ ప్రచారం చేశారు. అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు తిరగబడాలని ఆమె సూచించారు. మాయావతి ప్రభుత్వం అవినీతిని ప్రోత్సహించిందని ఆరోపించారు. మాయావతి ప్రజల ధనాన్ని దోచుకున్నారని దుయ్యబట్టారు. తప్పుడు హామీలతో ఎవరూ మోసపోవద్దని సూచించారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాన్ని కాంగ్రెసు మారుస్తుందని, ఆ మార్పుకు అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరారు. అభివృద్ధే ప్రధాన అజెండాగా ముందుకు వెళుతున్నామని చెప్పారు. యుపిలో కాంగ్రెసు ప్రభుత్వం విధిగా ఏర్పడుతుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. మాయా ప్రభుత్వంతో ప్రజలు విసిగి పోయారన్నారు. అవినీతి హెచ్చుమీరిందన్నారు.












Click it and Unblock the Notifications