సమ్మె బాటలో మళ్లీ తెలంగాణ ఉద్యోగులు, నోటీసులు
కాగా గత సంవత్సరం ద్వితీయార్థంలో తెలంగాణ ఉద్యోగ సంఘాలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం లక్ష్యంగా సకల జనుల సమ్మెను ప్రారంభించిన విషయం తెలిసిందే. సుమారు నెలన్నర రోజులు ఈ సమ్మె కొనసాగింది. దీంతో రాష్ట్ర ప్రజలు, ప్రధానంగా తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సింగరేణి, విద్యుత్, ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇలా పలు సంఘాలు సమ్మెలో పాల్గొన్నాయి. సింగరేణి కార్మికులు సమ్మెలో పాల్గొన్న ఎఫెక్ట్ రాష్ట్రంపై చాలా రోజులు పడిన విషయం తెలిసిందే. రాష్ట్రం మొత్తం విద్యుత్ కోతకు గురైంది. పలుమార్లు ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చల ఫలితంగా ఉద్యోగులు సమ్మెను విరమించారు. అయితే అప్పటి వాగ్ధానాలు నెరవేర్చలేదని చెబుతూ ఉద్యోగులు మళ్లీ సమ్మె నోటీసులు ఇచ్చారు.
Comments
swamy goud srinivas goud telangana sakala janula strike hyderabad స్వామి గౌడ్ శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ సకల జనుల సమ్మె హైదరాబాద్
English summary
Telangana Employees gave strike notices to government chief secretary today with demanding Sakala Janula Strike promises.
Story first published: Friday, February 10, 2012, 16:47 [IST]