జగన్ సమాధానం చెప్పాలి: చంద్రబాబు డిమాండ్
తెలంగాణలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు రెడ్ కార్పెట్ పరిచారని, తమపైకి రాళ్లు విసిరారని ఆయన అన్నారు. పోలవరం టెండర్ల రద్దు తమ విజయమేనని ఆయన అన్నారు. తాము చేసిన ఆరోపణల వల్లనే పోలవరం టెండర్లను ముఖ్యమంత్రి రద్దు చేశారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి ఇష్టం వచ్చినట్లు వ్యవహడరిస్తున్నారని ఆయన అన్నారు. బాంబులకే భయపడలేదు, ప్రాణాలను లెక్క చేయలేదని, వీరి బెదిరింపులకు భయపడేది లేదని ఆయన అన్నారు. తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు మంత్రి పదవి ఇచ్చి ఉంటే ఈ రోజు తమ వేదిక మీంచి మాట్లాడి ఉండేవారని ఆయన అన్నారు.
కుటుంబ సభ్యుల కన్నా తనకు పార్టీ కార్యకర్తలే ముఖ్యమని ఆయన అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో తెలంగాణ అభివృద్ధి జరిగిందని, దీనిపై తాము కాంగ్రెసుతో బహిరంగ చర్చకు సిద్ధమని ఆయన అన్నారు. కాంగ్రెసు తెలంగాణలో ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందో చెప్పాలని ఆయన అడిగారు. యువతకు నాయకత్వం అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు. తమ పార్టీ గెలిస్తేనే రాష్ట్రాన్ని కాపాడగలుగుతామని ఆయన అన్నారు.