హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎమ్మార్ కేసు: సునీల్ రెడ్డి ఖాతాలోకి రూ.96 కోట్లు?

By Pratap
|
Google Oneindia TeluguNews

Sunil Reddy
హైదరాబాద్: ఎమ్మర్ ప్రాపర్టీస్ కుంభకోణానికి సంబంధించి రూ. 96 కోట్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సన్నిహితుడు సునీల్ రెడ్డి ఖాతాలోకి మళ్లినట్లు తెలుస్తోంది. సిబిఐ ఈ మేరకు చార్జిషీట్‌లో పొందుపరిచినట్లు సమాచారం. నిందితులపై 9 సెక్షన్ల కింద అభియోగాలు మోపుతూ సిబిఐ కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్ వివరాలు గురించి ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్ ఓ వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. ఆ వార్తాకథనం ప్రకారం - సునీల్ రెడ్డి ఖాతాలోకి రూ. 96 కోట్లు జమ అయినట్లు సిబిఐ చార్జిషీట్‌లో తెలిపింది. ఎమ్మార్ ప్రాపర్టీస్‌ కుంభకోణం కేసులో సిబిఐ అధికారులు సునీల్ రెడ్డిని అరెస్టు చేసిన విషయం తెలిసింది.

సిబిఐ దాఖలు చేసిన చార్జిషీట్ తమ వద్ద ఉందంటూ ఆ టీవీ చానెల్ ప్రసారం చేసిన వార్తాకథనం వివరాలు ఇలా ఉన్నాయి - కోనేరు ప్రసాద్ కుమారుడు కోనేరు మధు ఖాతాలో కోటి రూపాయలు జమయ్యాయి. కోనేరు మధు దుబాయ్‌లో ఉంటున్నాడు. అధికారులు, కంపెనీలు కుట్ర చేసి ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన డబ్బులను కొల్లగొట్టారు. విల్లాల విక్రయాల ద్వారా స్టైలిష్ హోమ్స్ 167 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇందులో 96 కోట్లు అక్రమ వసూళ్లు. బిపి ఆచార్య తన మిత్రుడు త్రిపాఠీ పేరు మీద విల్లా స్థలం కొన్నాడు.

విల్లా కోసం ఐఎఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం సిఫార్సు చేశారు. రిటైర్డ్ ఐఎఎస్ అధికారి కెవి రావు పేరు మీద ఓ విల్లా ఉంది. పారిశ్రామికవేత్తల పేరు మీద విజయ రాఘవ విల్లాలు కొనుగోలు చేశాడు. ప్రభుత్వ వాటా తగ్గడానికి బిపి ఆచార్య కుట్ర చేశారని సిబిఐ అభియోగం మోపింది.

English summary
According to a news channel report - Rs 96 crores amount was deposited in Sunil Reddy's account.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X