విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భవానీ చిరంజీవి దీవి: దేవినేని ఉమామహేశ్వ రావు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi-Devineni Uma
విజయవాడ: భవానీ దీవిని రాష్ట్ర ప్రభుత్వం చిరంజీవి దీవిగా మార్చేస్తోందని తెలుగుదేశం పార్టీ శానససభ్యుడు దేవినేని ఉమామహేశ్వర రావు వ్యాఖ్యానించారు. భవానీ దీవిని ప్రైవేట్ పరం చేసే టెండర్లను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. భవానీ దీవిని రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాస రావుకు చెందిన ప్రత్యూష కంపెనీకి కట్టబెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తెలుగుదశం, సిపిఎం శనివారం విజయవాడలో ఆందోళనకు దిగాయి. అన్ని చట్టాలూ ఉల్లంఘించి భవానీ దీవిని ప్రైవేట్‌పరం చేయడానికి సిద్ధపడ్డారని ఆ పార్టీలు విమర్శించాయి.

దేవినేని ఉమామహేశ్వర రావు నాయకత్వంలో తెలుగుదేశం, సిపిఎం నాయకులు భవానీ దీవిని సందర్శించారు. పేద, మధ్య తరగతి వర్గాలకు పర్యాటక సౌందర్యాన్ని చౌకగా అందించేందుకు ఎన్టీఆర్ ఈ దీవిని అభివృద్ధి చేశారని రాజకీయ నాయకులు గుర్తు చేశారు. సిపిఐ, తెలుగుదేశం నాయకులు తొమ్మిదో నెంబర్ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు వారిని అరెస్టు చేశారు. కనకదుర్గమ్మ సాక్షిగా భవానీ దీవిని కాంగ్రెసు నాయకులు చిరంజీవికి బినామీగా వ్యవహరిస్తున్న మంత్రి గంటా శ్రీనివాసరావుకు కట్టబెట్టారని దేవినేని ఉమామహేశ్వర రావు విమర్శించారు.

English summary
TDP MLA de4vineni Umamaheswara Rao said that Bhavani island will become Chiranjeevi's island.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X