అసెంబ్లీ ఆవరణలో విపక్షాల బైఠాయింపు, నిరసన

గవర్నర్ ప్రసంగంలో ప్రజా సమస్యల ప్రస్తావన లేదని తెలుగుదేశం పార్టీ సభ్యుడు ఎర్రబెల్లి దయాకర రావు విమర్శించారు. గవర్నర్ కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా తొత్తుగా వ్యవహరిస్తున్నారని, తన పదవిని పొడగించుకునేందుకే కాంగ్రెసుకు గవర్నర్ అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఎర్రబెల్లి దయాకర్ రావు, మోత్కుపల్లి నర్సింహులు విమర్సించారు. తెలంగాణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాటకాలు ఆడుతున్నాయని మోత్కుపల్లి నర్సింహులు విమర్శించారు. ప్రభుత్వ రాసిచ్చిన కరపత్రాన్ని గవర్నర్ చదివారని ఆయన అన్నారు. ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆయన విమర్శించారు. ఆబ్కారీ మంత్రి మోపిదేవి వెంకటరమణను ఎందుకు బర్తరఫ్ చేయడం లేదని ఆయన అడిగారు. తెలంగాణ పేరు చెప్పుకుని తెరాస పోలవరం టెండర్లలో పాలు పంచుకుందని, దానిపై విచారణ చేయాలని అడిగామని, అయినా ప్రభుత్వం ఏమీ మాట్లాడడం లేదని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
గపర్నర్ ప్రసంగంలో తప్పుడు లెక్కలున్నాయని బిజెపి పక్ష నేత జి. కిషన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణపై ఇచ్చిన హామీని కాంగ్రెసు ప్రభుత్వం నిలబెట్టుకోలేదని, తెలంగాణపై కాంగ్రెసును దోషిగా నిలబెడుతామని, అందుకు నిరసనగానే గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించామని ఆయన చెప్పారు. గవర్నర్ ప్రసంగాన్ని సిపిఐ సభ్యుడు గుండా మల్లేష్ విమర్శించారు.












Click it and Unblock the Notifications