హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబుపై జగనే కేసు వేయించారు: రేవంత్ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Revanth Reddy
హైదరాబాద్: ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం విషయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై అబద్ధాలాడిస్తున్నారని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో చంద్రబాబును విచారించాలని భీంరెడ్డి ఎల్లా రెడ్డి చేత వైయస్ జగనే సుప్రీంకోర్టులో కేసు వేయించారని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆరోపించారు. భీంరెడ్డి ఎల్లా రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వరంగల్ జిల్లా నాయకుడని ఆయన చెప్పారు. పిటిషనర్ భీంరెడ్డి ఎల్లారెడ్డికి న్యాయవాదుల ఖర్చులు భరించే ఆర్థిక స్తోమత కూడా లేదని ఆయన అన్నారు.

చంద్రబాబుపై బురద చల్లాలని కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తలు ప్రసారం చేశాయని, కొన్ని మీడియా సంస్థలు సమాచారం సరిగా లేక తప్పుడు వార్తలు ఇచ్చాయని ఆయన అన్నారు. చంద్రబాబుపై చేస్తున్నవి తప్పుడు ఆరోపణలని వైయస్ జగన్మోహన్ రెడ్డికి తెలుసునని, అందుకే ఇతరుల చేత ఆరోపణలు చేయిస్తున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఎమ్మార్ వ్యవహారంలో తప్పులు జరగలేదని సిబిఐ చార్జిషీట్‌లో స్పష్టం చేసిందని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబుపై ఆరోపణలతో వార్తాకథనాలు రాస్తే మీడియాకు ఆయాసమే మిగులుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

వైయస్ రాజశేఖర రెడ్డి 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాతనే అక్రమాలు జరిగాయని, సిబిఐ దర్యాప్తు ప్రభుత్వ నిర్ణయాల మీద జరగడం లేదని, అవినీతి సొమ్ము ఎవరికి చేరిందనే విషయంపై సిబిఐ దర్యాప్తు జరుగుతోందని ఆయన అన్నారు.

English summary
TDP MLA Revanth Reddy has lashed out at YSR Congress president YS Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X