హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ ఆస్తుల కేసు: సిబిఐ ముందుకు దండమూడి

By Pratap
|
Google Oneindia TeluguNews

CBI
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో నిందితుడు, వ్యాపారవేత్త ఎకె దండమూడి మంగళవారం సిబిఐ ముందుకు వచ్చారు. వైయస్ జగన్‌కు చెందిన జగతి పబ్లికేషన్స్‌లో దండమూడి ఐదు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు. అందుకు ప్రతిఫలంగా ఆయన అనుమతులు పెట్టినట్లు ఆరోపణలున్నాయి. కొత్తగా మొదలు పెట్టిన కంపెనీల్లో ఏ విధంగా పెట్టబడులు పెట్టారని సిబిఐ అధికారులు దండమూడిని ప్రశ్నించినట్లు సమాచారం.

కాగా, పైన్నా సిమెంట్స్ ప్రతినిధులతో పాటు వ్యాన్‌పిక్, సీపోర్టు ప్రైవేట్ లిమిటెడ్ అధికారులు కూడా మరోమారు సిబిఐ ముందు హాజరయ్యారు. ఇదిలా ఉంటే, వైయస్ జగన్ ఆస్తుల కేసులో అరెస్టయిన విజయ సాయి రెడ్డి జ్యుడిషియల్ రిమాండ్‌ను సిబిఐ ప్రత్యేక కోర్టు పొడగించింది. ఈ నెల 21వ తేదీ వరకు కోర్టు ఆయన రిమాండ్‌ను పొడగిస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.

English summary
Businessman AK Dandamudi deposed before CBI in YSR Congress president YS Jagan assets case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X