భవానీ ద్వీపంపై వివరణ ఇవ్వండి: లోకాయుక్త ఆదేశం

నిబంధనలకు విరుద్ధంగా భవానీ ద్వీపాన్ని లీజుకు ఇవ్వడంపై సాయికృష్ణ ఆజాద్ అనే న్యాయవాది లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం జారీ చేసిన జివో 148 ప్రకారం భవానీ ద్వీపంలో తాత్కాలిక నిర్మాణాలు మాత్రమే చేపట్టాలని, కానీ అందుకు విరుద్ధంగా పర్యాటక శాఖ టెండర్లు పిలిచిందని ఫిర్యాదుదారు ఆరోపించారు. ఇందులో ఇరవై శాతం శాశ్వత నిర్మాణాలకు అనుమతించడం చెల్లదని అందులో తెలిపారు. మూడు టెండర్లు వచ్చాయని, అందులో రెండు నామమాత్రమేనని అన్నారు. ప్రత్యూష రూ.289.87 కోట్లకు టెండరు వేయగా, మరో రెండు కంపెనీలు రూ.33.21, రూ25.52 కోట్లకు మాత్రమే టెండరు వేయడంపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. దీనిపై లోకాయుస్త జస్టిస్ ఆనంద రెడ్డి విచారణ చేపట్టారు.












Click it and Unblock the Notifications