రైల్వే మంత్రితో భేటీకి జగన్ వర్గం ఎంపీలు డుమ్మా
ఖాజీపేటలో రైల్వే వ్యాగన్ల ప్రాజెక్టును పెట్టాలని కోరినట్లు రాజయ్య చెప్పారు. ఈసారి బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు న్యాయం చేయాలని టి. సుబ్బిరామి రెడ్డి కోరారు. ఎంఎంటిఎస్ రెండో దశకు నిధులు విడుదల చేయాలని, వైజాగ్ వాల్తేరు డివిజన్గా విభజించాలని సత్యవతి రాథోడ్ కోరారు. రైల్వే విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని జి. వివేక్ అన్నారు. కేంద్ర మంత్రులు పురంధేశ్వరి, వనబాక లక్ష్మి, పలువురు పార్లమెంటు సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రైల్వే శాఖ సహాయ మంత్రి మునియప్ప కూడా సమావేశంలో ఉన్నారు. తెలుగుదేశం పార్లమెంటు సభ్యులు కూడా ఈ సమావేశానికి రాలేదు. ఈ సమావేశానికి ముందు ఇటీవల కిరణ్ కుమార్ రెడ్డి పార్లమెంటు సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
Comments
sabbam hari mekapati rajamohan reddy railway hyderabad సబ్బం హరి మేకపాటి రాజమోహన్ రెడ్డి రైల్వే హైదరాబాద్
English summary
YSR Congress president YS Jagan camp MPs Sabbam Hari and Mekapati Rajamohan Reddy skipped the meeting with Railway Minister.
Story first published: Wednesday, February 15, 2012, 18:17 [IST]