జయ పంజా: డిఎంకె మాజీ మంత్రిపై విజిలెన్స్ దాడులు
విజిలెన్స్ తంగంపై కేసు నమోదు చేసింది. చెన్నై పరిసర ప్రాంతాలు, తంగం ఇళ్లు, విరుధునగర్, మధురై, దిండిగుల్ తదితర ప్రాంతాలలోని ఆయన బంధువుల ఇళ్లపై విజిలెన్స్ బుధవారం ఉదయం దాడులు చేసింది. కాగా మే 2011లో జయలలిత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమిళనాడులో డిఎంకె నేతలపై వరుస దాడులు జరుగుతున్నాయి. మాజీ మంత్రులు దురై మురుగన్, కెఎన్ నెహ్రూ, టిఎం అంబరసన్, కె పొన్ముడి, ఎన్ సురేష్ రాజన్, పొంగలూర్, ఎన్ పళనిస్వామి, పన్నీర్ సెల్వం తదితరులపై విజిలెన్స్ దాడులు చేసింది.
అయితే తమ నేత తంగం ఇల్లు, కార్యాలయాలపై దాడులు కక్ష సాధింపులో భాగమని డిఎంకె నేతలు అంటున్నారు. అన్నాడిఎంకె అధికారంలోకి వచ్చినప్పటి నుండి జయలలిత తమ పార్టీ కార్యకర్తలను, నేతలను టార్గెట్గా చేసుకొని దాడులు నిర్వహిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. దాడులను డిఎంకె తీవ్రంగా ఖండించింది. కాగా వచ్చే ఎన్నికల్లో ఈ దాడులనే తమ అజెండాగా పెట్టుకుంటామని డిఎంకె చీఫ్ కరుణానిధి ఇటీవలె చెప్పారు.