దుమారం రేపిన బాబు పిల్లల సభ్యత, సంస్కారం వ్యాఖ్య

కాగా బిజెపి నేత కిషన్ రెడ్డి సభలో మాట్లాడుతూ... మద్యాన్ని ఆదాయవనరుగా చూడవద్దని సూచించారు. రాష్ట్రంలో బెల్టు షాపులు రెండు లక్షలకు పైగా ఉన్నాయని వాటన్నింటిని ఎత్తివేయాలన్నారు. పని మనుషుల పేరుతో పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ మద్యం వ్యాపారాలు చేస్తున్నారని టిడిపి నేత గాలి ముద్దుకృష్ణ ఆరోపించారు. మంత్రి ధర్మాన పిఏ ముడుపులు తీసుకున్నారని ఆరోపించారు. అందుకు నైతిక బాధ్యత వహిస్తూ ధర్మాన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెసు వైయస్ అవినీతి కొనసాగిస్తోందన్నారు. సిఎం కిరణ్ మాత్రమే సిండికేట్లపై సమాధానమివ్వాలన్నారు. వచ్చే ఎన్నికల్లో టిడిపిదే అధికారం అన్నారు. తనను ఉద్దేశించి గాలి మాటలన్న కాంగ్రెసు నేతలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. గాలి మాటలంటే సుడిగాలిలో కొట్టుకు పోతారన్నారు.












Click it and Unblock the Notifications