'లోకేష్' లెక్కలు చెప్పాలి?, వారిది డ్రామా: జగన్‌పార్టీ నేత

bajireddy goverdhan reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏజెంటులా వ్యవహరిస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి శుక్రవారం విమర్శించారు. హైదరాబాదులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి, చంద్రబాబు శాసనసభలో డ్రామాలు ఆడుతున్నారన్నారు. వారిద్దరూ సభలో కుస్తీ పడుతూ బయట మాత్రం దోస్తీ చేస్తున్నారన్నారు. చంద్రబాబు జైలుకు వెళ్లే వాడని చెప్పిన కిరణ్ ఆ తర్వాత ఎందుకు ఆపారని ప్రశ్నించారు.

చంద్రబాబు తన కుమారుడి చదవులకు సత్యం కంప్యూటర్స్ రామలింగరాజుతో ఫీజు కట్టించుకొని ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్నారని ఆరోపించారు. అయినా ఈ విషయమై ఆరోపణలు చేసిన ఆరు నెలలకు ఇప్పుడు స్పందిస్తారా అని అడిగారు. ఖర్చు పెడితే లోకేష్ కుమార్ చదవులకు అయిన రూ.60 కోట్ల రూపాయలకు లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. సమయం సందర్భం లేకుండా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి గురించి సభలో మాట్లాడుతున్నారని బాజిరెడ్డి అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+