'తెలంగాణ'ను బాబుపైకి నెట్టిన బొత్స, జగన్‌తో ఢీకి సై

otsa Satyanarayana
న్యూఢిల్లీ: ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ వైఖరి వల్లనే తెలంగాణ సమస్య మరింత క్లిష్టమైందని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ శుక్రవారం అన్నారు. ఆయన న్యూఢిల్లీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణపై తెలుగుదేశం పార్టీ గంటకోమాట చెబుతోందని ఆరోపించారు. ప్రతిపక్షం మాట మార్చడం వల్లనే తెలంగాణ సమస్య మరింత జఠిలమైందన్నారు. సమస్యకు కాంగ్రెసు త్వరలో పరిష్కారం చూపుతుందని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనపై చేసిన ఆరోపణలకు హైదరాబాద్ వచ్చిన తర్వాత సమాధానం చెబుతానన్నారు. ఆయనొక్కరే నీతమంతుడనని అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అలా అయితే తనపై వేసిన ఆస్తుల కేసులో చంద్రబాబు కోర్టుకు వెళ్లి స్టే ఎందుకు తెచ్చుకుంటారని ప్రశ్నించారు. వ్యవసాయరంగంపై ఆయనకు చిత్తశుద్ధి లేదని అందుకే సభలో రైతుల సమస్యలపై మాట్లాడటం లేదన్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. నిబంధనలకు అనుగుణంగా జగన్ వర్గం ఎమ్మెల్యేలపై వేటు పడుతుందని అన్నారు. సభకు విపక్షాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. గెలుపోటములకు, జగన్ వర్గం ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధం లేదన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ పని తీరును తాను కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్‌కు వివరించానని అన్నారు. ఉప ఎన్నికల్లో గెలుపోటములతో కాంగ్రెసుకు సంబంధం లేదన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల నినాదంతో తాము ప్రచారానికి వెళ్తామన్నారు. ఉప ఎన్నికల్లో విజయంపై తమ కార్యాచరణ తమకుందని, అందరం కలిసి పని చేస్తామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+