సిఎంనూ వదలమన్న బాబు, ఊరుకోమన్న కిరణ్
ఆ తర్వాత చంద్రబాబు... దోషులను కాంగ్రెసు పెంచి పోషించిందన్నారు. దోషులను దాచిపెట్టే పరిస్థితి వస్తే ముఖ్యమంత్రిని కూడా తాము వదిలే ప్రసక్తి లేదన్నారు. ఎసిబి నివేదికలో పేజీలు ఎందుకు తొలగించారన్నారు. ఏడో పేజీ ఎక్కడుందన్నారు. మంత్రులతో క్రిమినల్స్ ఉన్నారన్నారు. మద్యం నియంత్రణ చేయాల్సిన అవసరముందన్నారు. లేదంటే సమాజం నిర్వీర్యమవుతుందన్నారు. ఒక మంత్రిని కాపాడేందుకు మరొకరిని ఇరికించారని ఆరోపించారు. పేదవాడి జీవితంతో ప్రభుత్వం ఆడుకుందన్నారు. బాబు వ్యాఖ్యలపై సిఎం మండిపడ్డారు. ఏడో పేజీ ఎక్కడ మిస్ కాలేదని అన్నారు. ఏ పేజీలు మిస్ కాలేదని అన్నారు. పేజీలు ఎక్కడ పోయాయో ఆయనే చూపాలన్నారు. మీడియా కథనాలతో నిరాధార ఆరోపణలు చేయవద్దన్నారు. దోషులను ఖచ్చితంగా శిక్షిస్తామన్నారు. అమాయకులను ఇరికించే ప్రయత్నాలు చేస్తే ఊరుకోమన్నారు. ప్రభుత్వం పారదర్శకంగా ఉందన్నారు. విషయం లేకుండా తమపై బురద జల్లితే ఊరుకునేది లేదన్నారు. ఆధారాలు ఉంటే బాబు సభలో పెట్టాలని డిమాండ్ చేశారు. కోర్టులో ఉన్న అంశంపై చర్చించేందుకు ఒప్పుకోవడానికి కారణం ప్రజల అపోహలు తొలగించేందుకేనన్నారు.