ఛీ అంటే ఛీ!: సభలో టిడిపి, కాంగ్రెస్ వ్యక్తిగత దూషణలు
అందుకు కన్నా మాట్లాడుతూ... ఎవరో ఇచ్చిన ప్రకటనలకు తమ పార్టీ నేతను బాధ్యుడిని ఎలా చేస్తారన్నారు. ఎవరెవరో ఇస్తారు అది తమ బాధ్యత అవుతుందా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంది కాబట్టే కోర్టులో ఉన్న అంశంపై సభలో చర్చించేందుకు సరేనన్నారన్నారు. ప్రభుత్వానికి ఎవరినీ రక్షించే ఉద్దేశ్యం లేదన్నారు. సిఎంకు అలా ఉంటే ఇక్కడి వరకు వచ్చిది కాదన్నారు. ఓ సమయంలో కన్నా బాబుపై తీవ్ర విమర్శలు చేశారు. సొంత మామకు వెన్ను పోటు పొడిచిన బాబు మాట్లాడటం విడ్డురంగా ఉందన్నారు. అవినీతిలో పుట్టి అవినీతిలో పెరిగి అవినీతతో బతుకుతున్న బాబు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. తొమ్మిదేళ్లు సిఎంగా పని చేశానని ఆయన చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. కర్షక పరిషత్ నుండి ఎత్తాల్సి ఉంటుందని హెచ్చరించారు. అంతకుముందు బాబు కొడుకు తప్పు చేసి పట్టుబడితే సమర్థించుకున్నారని మండిపడ్డారు. ఎసిబి దాకా వద్దని మొదట ముఖ్యమంత్రి మంత్రుల నైతికత చూసుకోవాలని సూచించారు. సిగ్గుంటే ప్రభుత్వం మద్యం ముడుపులపై సమాధానం చెప్పాలి కానీ దాటవేత ధోరణి సరికాదన్నారు.