గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు కాలనీలో వైయస్ విగ్రహం, జగన్ ఆవిష్కరణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

YSR Statue
గుంటూరు: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని చంద్రబాబు కాలనీలో శుక్రవారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. గుంటూరు జిల్లాలో జగన్ ఓదార్పు యాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆయన నరసారావుపేటలోని చంద్రబాబు కాలనీలో వైయస్సార్ విగ్రహం ఆవిష్కరించారు. విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఓదార్పులో భాగంగా అక్కడకు వచ్చిన జగన్‌కు అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పార్టీకి అనుకూలంగా నినాదాలు హోరెత్తించారు. ఆ తర్వాత జగన్ మిట్టబజారులో మరో విగ్రహం ఆవిష్కరించారు. నరసారావుపేటలో జగన్ తొమ్మిది విగ్రహాలు ఆవిష్కరించారు.

కాగా గుంటూరులో జగన్ రెండో విడత ఓదార్పు యాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఉదయం పార్టీ నేత గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి ఇంటి నుండి జగన్ యాత్ర ప్రారంభమైంది. నాగుర్ వలి టాకీస్, క్రిస్టియన్ పాలెంలలో జగన్ వైయస్సార్ విగ్రహాలు ఆవిష్కరించారు. ఆ తర్వాత చంద్రబాబు కాలనీ, బిసి కాలనీ, మెట్టబజార్‌ తదితర ప్రాంతాలలో విగ్రహాలను ఆవిష్కరించారు.

English summary
YSR Congress Party chief YS Jaganmohan Reddy inaugurated late YSR statue at Chandrababu colony of Guntur district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X