సిఎంకు పదవి భయం, బొత్స దొంగలా తిరిగారు: టిడిపి
మంత్రులతో మద్యం వ్యాపారం చేయించి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి ముడుపులు అందజేస్తున్నారని ఆరోపించారు. మద్యంపై ఎసిబి విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి అనుచరులే ఇప్పటి కేబినెట్లో ఉన్నారన్నారు. వైయస్ లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. మంత్రులను వెంటనే బర్తరఫ్ చేయించాలన్నారు. ఎసిబి రిపోర్టు వెంటనే బయట పెట్టాలని డిమాండ్ చేశారు. కాగా ఆ తర్వాత టిడిపి నేతలతో స్పీకర్ నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు. సభ సజావుగా నడిచేందుకు సహకరించారని వారిని కోరారు. మద్యం కుంభకోణంపై చర్చించేందుకు తమకు తక్కువ అవకాశం ఇచ్చారని టిడిపి ఎమ్మెల్యేలు స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. చర్చ జరగాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు.
Comments
mothkupalli narasimhulu chandrababu naidu assembly botsa satyanarayana hyderabad మోత్కుపల్లి నర్సింహులు చంద్రబాబు నాయుడు అసెంబ్లీ బొత్స సత్యనారాయణ హైదరాబాద్
English summary
TDP senior leader Mothkupalli Narasimhulu blamed that CM Kiran Kumar Reddy is in fear to take action on ministers.
Story first published: Monday, February 27, 2012, 10:34 [IST]