మద్యం మాఫియా ముసుగు వీరుడు కిరణ్ రెడ్డి: దాడి

Dadi Veerabhadra Rao
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మద్యం మాఫియా ముసుగు వీరుడు అని తెలుగుదేశం పార్టీ నేత దాడి వీరభద్ర రావు ఆదివారం మండిపడ్డారు. చివరకు న్యాయస్థానాలు, దేవాలయాల్లో కూడా మద్యం అమ్మకాలకు అనుమతిస్తారేమోనని ఆయన సందేహం వ్యక్తం చేశారు. దేవుడికి నైవేద్యం సమయంలో మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అంటూ నీళ్ళు సమర్పిస్తారని, ఈ సిఎం మాత్రం మధ్యే మధ్యే మద్యం సమర్పయామి అంటారని ఎద్దేవా చేశారు. చూడబోతే తిరుమల, అన్నవరం కొండలపై కూడా మద్యం దుకాణాలకు అనుమతిచ్చేలా ఉన్నారని వ్యాఖ్యానించారు. కిరణ్ కుమార్ రెడ్డి సూపర్ చీఫ్ జస్టిస్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

ముఖ్యమంత్రి ఈ ఏడాది భారీగా అదనపు మద్యం ఉత్పత్తికి అనుమతిచ్చారని, అదనపు మద్యంపై గతం నుంచి ఉన్న పన్నును తగ్గించారని ఈ సొమ్మంతా ఎవరి జేబుల్లోకి పోయిందో చెప్పాలని ప్రశ్నించారు. మంత్రి మోపిదేవి వెంకట రమణ నిందితుడని తెలిసినా సిఎం ఆయనను రక్షించారని మండిపడ్డారు. సిఎం తాను స్పోర్ట్స్ పర్సన్ అని చెప్పుకుంటూ లిక్కర్ పర్సన్ గా మారారని దుయ్యబట్టారు. మద్యం కుంభకోణంపై న్యాయవిచారణ జరిపించాలన్నారు.

రాజీవ్ యువకిరణాల పథకంలో శిక్షణ పొందిన 616 మంది అభ్యర్థులు హెరిటేజ్‌లో ఉద్యోగాలు పొందారని సిఎం శాసనసభలో అబద్దాలు చెప్పారని టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నర్సిరెడ్డి అన్నారు. ఆ సంస్థలో గత ఆరు నెలలుగా 616 ఉద్యోగాలు భర్తీ కానప్పుడు యువకిరణాల ద్వారా ఏ రకంగా ఇచ్చారో చెప్పాలన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పచ్చి అవకాశవాది అని, ఆయనకు బాబును విమర్శించే నైతిక అర్హత లేదని మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+